హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ) : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఐసెట్కు రూ. 500 జరిమానా చెల్లించి దరఖాస్తు చేసుకొనేందుకు గురువారం చివరి గడువు అని కన్వీనర్ పీ వరలక్ష్మీ తెలిపారు. ఈ నెల 26, 27న తెలంగాణలో 16, ఏపీలో 4 పరీక్షాకేంద్రాల్లో ఐసెట్ నిర్వహిస్తామని పేర్కొన్నారు.