హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ) : ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 62వ ఆవిర్భావ దినోత్సవం శుక్రవారం రాజేంద్రనగర్లో వర్సిటీ ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ విద్యాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ సదస్సు కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి జస్టిస్ బీ సుదర్శన్రెడ్డి, ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు ప్రొఫెసర్ మధురా స్వామినాథన్ హాజరుకానున్నట్టు తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ పార్లమెంటేరియన్ ఉండవల్లి అరుణ్కుమార్ తదితరులు కూడా హాజరవుతారని రిజిస్ట్రార్ విద్యాసాగర్ వెల్లడించారు.