హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పోరాట యోధురాలు జే ఈశ్వరీబాయి 104వ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్నట్టు తెలంగాణ సాంస్కృతిక శాఖ అధికారులు, ఈశ్వరీబాయి ట్రస్ట్ చైర్పర్సన్ జే గీతారెడ్డి తెలిపారు. గురువారం ఉదయం 9 గంటలకు వెస్ట్మారేడ్పల్లిలోని ఈశ్వరీబాయి విగ్రహానికి నివాళులు అర్పించ నున్నట్టు చెప్పారు. సాయంత్రం 5 గంట లకు రవీంద్రభారతిలో నిర్వహించే కార్యక్రమానికి ముఖ్యఅథితులుగా సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్తో పాటు పలువురు మంత్రులు, అధికారులు, ప్రముఖులు హాజరుకానున్నట్టు వెల్లడించారు.
ప్రభుత్వానికి అంసా కృతజ్ఞతలు
జెట్టి ఈశ్వరీబాయి 104వ జయంతిని ప్రతిఏటా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం అభినందనీయమని ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అంగరి ప్రదీప్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ మంచాల లింగస్వామి అన్నారు. ఈశ్వరీబాయి మెమోరియల్ అవార్డును మానవతావాది, ప్రముఖ బుద్ధిస్టు కేకే రాజాకు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.