హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): నూతనంగా ఎన్నికైన తెలంగాణ గెజిటెడ్ అధికారుల (టీజీవో) కేంద్ర సంఘం కార్యవర్గాన్ని టీఎన్జీవో నేతలు మంగళవారం ఘనంగా సన్మానించారు. టీజీవో అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాస్రావు, ప్రధాన కార్యదర్శిగా ఎనుగల సత్యనారాయణ ఇటీవలే ఎన్నికైన విషయం తెలిసిందే. దాంతో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్, అసోసియేట్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, కోశాధికారి రామినేని శ్రీనివాస్రావు, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎండీ ముజీబ్ హుస్సేని తదితరులు నూతన కార్యవర్గాన్ని శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో టీజీవో అసోసియేట్ అధ్యక్షడు శ్యామ్, కోశాధికారి ఉపేందర్రెడ్డి, సలహాదారులు రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.