హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ వీఆర్ఎస్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ గడల శ్రీనివాసరావు గురువారం ఉత్తర్వులను జారీ చేశారు. ఆయన ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్వో కార్యాలయ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నారు. ఉద్యోగం నుంచి శుక్రవారం రిలీవ్ కానున్నారు.
వీఆర్ఎస్ కోసం రాజేందర్ ఈ ఏడాది జూలైలో ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగంలో కొనసాగలేనని పేర్కొన్నారు. 20 ఏండ్ల సర్వీస్ పూర్తయిందని, వీఆర్ఎస్కు అనుమతించాలని కోరుతూ ఆయన చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
మామిళ్ల రాజేందర్ వీఆర్ఎస్ నేపథ్యంలో నూతన అధ్యక్షుడిని ఎన్నుకొనేందుకు గురువారం టీఎన్జీవో కేంద్ర కార్యవర్గం సమావేశమైంది. అయితే, ఈ ఎన్నికపై సిటీ సివిల్ కోర్టు స్టే విధించింది. దీంతో ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న మారం జగదీశ్వర్ను అధ్యక్షుడిగా ఎన్నుకొనే అవకాశం ఉన్నది. ఈ నెల 30న కొత్త అధ్యక్షుడిని ప్రకటించనున్నట్టు సమాచారం.