హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) నేతలు మంగళవారం ఢిల్లీలో కలుసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్ నేతృత్వంలోని నాయకుల బృందం జస్టిస్ రమణను మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై చర్చించింది. కార్యక్రమంలో టీఎన్జీవో రాష్ట్ర సహ అధ్యక్షుడు సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిలక నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.