హాలియా, ఏప్రిల్ 7: నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఎమ్మార్పీఎస్ టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించింది. బుధవారం హాలియాలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో టీఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ, రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ.. జానారెడ్డి 35 ఏండ్లు మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసినా ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. ఇప్పుడు గెలిచి ఏం చేస్తాడని వారు ప్రశ్నించారు. జానారెడ్డి పోటీ నుంచి వైదొలిగి, నోముల భగత్ను ఏకగ్రీవంగా శానససభకు పంపిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. నాగార్జునసాగర్లో బీజేపీకి బలం లేదన్నారు. సాగర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఏకమై నోముల భగత్ను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు కోరారు.
ఎంబీసీ సంక్షేమ సంఘం మద్దతు
సాగర్లో టీఆర్ ఎస్ అభ్యర్థి నోముల భగత్కు తెలంగాణ ఎంబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ నరహరి మద్దతు ప్రకటిం చారు. భగత్ను గెలిపించాలని కోరారు.