హైదరాబాద్, మార్చి 18(నమస్తే తెలంగాణ): టీఎస్ఆర్టీసీ అమలు చేస్తున్న తిరుపతి టూర్ ప్యాకేజీ విజయవంతంగా కొనసాగుతున్నదని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ప్యాకేజీ ప్రారంభించిన ఎనిమిది నెలల్లో 1,14,565 మందికి రూ.300 టికెట్లతో శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం చేయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని అన్నిప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతున్నట్టు పేర్కొన్నారు. అవసరమైన ప్రయాణికులు ఆర్టీసీ వెబ్సైట్ www.tsrtconline.in ద్వారా టికెట్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు.