హైదరాబాద్, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): అక్టోబర్కు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను టీటీడీ బుధవారం విడుదల చేసింది. వీటితోపాటు అక్టోబర్ నెల కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్సేవ, సహస్ర దీపాలంకరణ తదితర వర్చువల్ సేవల దర్శన కోటా టికెట్లను కూడా విడుదల చేశారు. ఆర్జిత సేవ కోసం మొత్తం 54 వేల టికెట్లను అందుబాటులో ఉంచారు. భక్తులు ఆర్జిత సేవ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో బుక్ చేసుకోవాలని సూచించింది. మంగళవారం తిరుమల శ్రీవారిని 68,467 మంది భక్తులు దర్శించుకొన్నారు. హుండీ ఆదాయం రూ.4.67 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ కొనసాగుతుండటంతో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి.