Telangana polls | హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అసెంబ్లీ సాధారణ ఎన్నికల్లో 9వేల మంది ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకున్నారు. దివ్యాంగులు, 80 సంవత్సరాల పైబడిన వారు, అత్యవసర సేవలు అందించే 13 శాఖల అధికారులు, ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం ఎన్నికల సంఘం కల్పించింది.
ఈ తరహాలో ఓటింగ్ కు 12 డీ ఫారం ద్వారా దరకాస్తు చేసుకున్నారు. అర్హులైన వారు 29,267 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటి వరకు 9,174 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఓటింగ్ ప్రక్రియను ఈనెల 26 కల్లా పూర్తి చేయాలని ఆర్వోలకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియను అధికారులు వేగవంతం చేశారు. ఇంటి వద్ద ఓటు వేసే ప్రక్రియను వీడియో రికార్డు చేస్తున్నారు. ఆ ఓట్లను భద్ర పరిచి ఓట్ల లెక్కింపు రోజున మొదట లెక్కిస్తారు.