అమ్రాబాద్, నవంబర్ 24: నాగర్కర్నూల్ జిల్లా వటువర్లపల్లి గ్రామ శివారులో గురువారం ఉదయం పులి ప్రత్యక్షమైంది. శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారిపై ప్రయాణికులకు కన్పించింది.
శ్రీశైలం నుంచి తిరిగి వస్తున్న యాత్రికులకు రోడ్డు దాటుతూ కన్పించింది. దీంతో వాహనాలను దూరంలోనే నిలిపి సెల్ఫోన్లలో ఫొటోలు తీసుకున్నారు. నల్లమలలో పులుల సంఖ్య పెరిగిందని అటవీశాఖ అధికారులు తెలిపారు.