నల్లగొండ : తుంగతుర్తి నియోజకవర్గం నుంచి యాదాద్రి ఆలయానికి కిలో బంగారాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ విరాళంగా ప్రకటించారు. గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా తన వంతుగా 250 గ్రాముల బంగారం యాదాద్రికి ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే ప్రకటించారు.
తిరుమలగిరికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఇమ్మడి సోమనర్సయ్య (బ్రదర్స్) 250 గ్రాములు, సూర్యాపేట జడ్పీ చైర్పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ 10 తులాలు, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేంధర్ రెడ్డి 6 తులాలు, మోత్కూర్ ఎంపీపీ రచ్చ కల్పన లక్ష్మీనర్సింహారెడ్డి 5 తులాలు, మోత్కూర్ జడ్పీటీసీ గోరుపల్లి శారద సంతోష్ రెడ్డి 5 తులాలు, సామ ఆంజనేయులు 5 తులాలు, గానుగుబండ సర్పంచ్ నల్లు రామచంద్రా రెడ్డి 5 తులాలు, గురజాల సర్పంచ్, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు, శాలిగౌరారం గుండా శ్రీనివాస్ 5 తులాలతో పాటు టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు తమ వంతుగా విరాళం అందిస్తామని ప్రకటించారు. దీంతో త్వరలోనే అందరితో కలిసి యాదాద్రి వెళ్లి అధికారులకు అందజేయనున్నట్లు ఎమ్మెల్యే కిషోర్ తెలిపారు.