హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో హీలియం బెలూన్ పేలి ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నదని విజయవాడ ప్రభుత్వ వైద్యులు తెలిపారు.
ఆగిరిపల్లికి చెందిన షేక్ అలియా అనే మహిళ తన కూతురుతోపాటు మరో చిన్నారిని వెంట బెట్టుకొని స్థానికంగా ఉన్న ఓ బ్యాంకుకు వెళ్ళింది. అలియా.. బ్యాంకులో పనిచేసుకొంటున్న సమయంలో చిన్నారులిద్దరూ బ్యాంకు మేడపైకి వెళ్లారు. ఆ సమయంలో ఓ పార్టీకి చెందిన భారీ హీలియం బెలూన్ పేలడంతో చిన్నారులిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.