నాంపల్లి కోర్టులు, అగస్టు 21 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరో ముగ్గురిని సిట్ అధికారులు రిమాండ్కు తరలించారు. నిందితులను ఆదివారం మెజిస్ట్రేట్ ఇంటి దగ్గర హాజరుపర్చగా, మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో నిందితుల సంఖ్య 102కు చేరింది. అలాగే, నిందితులు కాంతారావు, సోదరులు శ్రీనివాస్, రవికుమార్ బెయిల్ పిటిషన్లపై సిట్ పీపీ అభ్యంతరం వ్యక్తం చేశారు. బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టుకు కోరారు. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నదని, అరెస్టుల సంఖ్య పెరుగుతున్నదని చెప్పారు.