ములుగు : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు మావోయిస్టులు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన ముగ్గురు మావోయిస్టులుసోమ అలియాస్ మధు అలియాస్ సమ్మయ్య,(45), దొడి నంద (33) తోపాటు మడకం గంగ (45) పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు తెలిపారు. పై ముగ్గురు పలు ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ నుంచి వేధింపులు ఎదురవుతున్న నేపథ్యంలో పార్టీని వీడాలని నిర్ణయించుకొని లొంగిపోయినట్లు ఆయన తెలిపారు.