హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐఏఎస్ లను ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. భారతీ లక్పతి నాయక్, హరీశ్లను తమిళనాడుకు, సత్య శారదాదేవిని అస్సాం ఎన్నికల పరిశీలకులుగా నియమించారు. ఈ నెల 27న ఆయా రాష్ట్రాల ఎన్నికలను పరిశీలిస్తారు.