హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : సాంకేతిక పరిజ్ఞానంతో మూడు రకాల కొత్త ఫ్యూచర్స్కిల్స్ ప్రైమ్ కో ర్సులను జేఎన్టీయూ హైదరాబాద్ ప్రవేశపెట్టింది. బ్లాక్చైన్ టెక్నాలజీ, ప్రాగ్మాటిక్ అప్రో చ్ టు సైబర్ సెక్యూరిటీ, త్రీడీ ప్రింటింగ్ అం డ్ క్యాడ్ మాడలింగ్ స్కిల్స్ కోర్సులను అం దుబాటులోకి తెచ్చింది.
ఈ కోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం జేఎన్టీయూహెచ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 90 రోజుల కోర్సుకు బీటెక్ థర్డ్, ఫోర్త్ ఇయర్, ఎంటెక్ పూర్తి చేసిన విద్యార్థులు, ఇంటర్న్షిప్/ అ ప్రెంటీస్, ఐటీ, నాన్ ఐటీ రంగంలోని ప్రొఫెషనల్స్, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ కోర్సుల్లో చేరేందుకు అర్హులు అని వర్సిటీ వీసీ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. వివరాలకు జేఎన్టీయూహెచ్ అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చని సూచించారు.