నల్లగొండ : తెలుగు రాష్ట్రాల్లో(Telugu states) జరిగిన రోడ్డు ప్రమాదాల్లో(Road accident) ముగ్గురు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా(Nallagonda district) లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లికూతుళ్లు మృతి చెందారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం కొండ్రపోలు వద్ద ద్విచక్రవాహానాన్ని లారీ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో తల్లి ఆదిలక్ష్మి(35), కూతురు ప్రశాంతి(13) మృతి చెందారు. తండ్రి, కుమారుడికి గాయాలు కాగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.మృతులు బాపట్ల జిల్లా జె.పంగూలూరు మండలం కొంబమంజూలూరు వాసులుగా గుర్తించినట్లు తెలిపారు. బాపట్ల జిల్లా(Bapatla district) నిజాంపట్నం ప్రభుత్వాసుపత్రి వద్ద అర్ధరాత్రి ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన బైక్ రోడ్డు పక్కన వంతెనను ఢీ కొనగా తేజ (22) అనే యువకుడు మృతి చెందాడు. మరో యువకుడికి తీవ్రగాయాలు కాగా అతడిని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.