హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): సివిల్స్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈ నెల 29,30,31 తేదీల్లో మూడు రోజుల ఉచిత బ్రిడ్జికోర్సును నిర్వహిస్తున్నట్టు ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ చైర్మన్ పీ క్రిష్ణప్రదీప్ వెల్లడించారు.
అశోనగర్లోని అకాడమీ సెమినార్ హాల్లో ఈ బ్రిడ్జికోర్సును నిర్వహిస్తున్నామని, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు ఏకేఖాన్, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి బీపీ ఆచార్య, ఐఏఎస్ అధికారి రోణంకి గోపాలకృష్ణ, ఓయూ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతా గణేశ్ హాజరవుతారని తెలిపారు. ఇతర వివరాల కోసం 86862 33879, 91336 37733 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.