నాంపల్లి కోర్టులు, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ముగ్గురు నిందితులు మాలోత్ బుజ్జిబాబు, గుగులోత్ రాంనాయక్, ఆలేడి భరత్కుమార్ను పోలీసులు అరెస్టు చేసి బుధవారం కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ జీ ఈశ్వరయ్య ఆ ముగ్గురికి బెయిల్ మంజూరు చేశారు. ఈ కేసులో రిమాండ్కు తరలించకుండా నిందితులను విడుదల చేయడం ఇదే తొలిసారి. వీరితో కలిసి నిందితుల సంఖ్య 105కు చేరింది. 102వ నిందితుడు ప్రశాంత్ అలియాస్ ప్రశాంత్రెడ్డి కస్టడీ పిటిషన్ తీర్పును వాయిదా వేశారు. అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చరాదని, నిందితులకు 41-ఏ జారీ చేయాలని సిట్ అధికారులను ఆదేశించారు.