యాదాద్ర భువనగిరి, జనవరి 11 (నమస్తే తెలంగాణ) : యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాలు తయారు చేస్తున్న ముగ్గురు వ్యాపారులను ఫుడ్సేఫ్టీ అధికారులు బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న పక్కా సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. బీబీనగర్ మండలంతోపాటు కొండమడుగు గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న కడెం కుమార్యాదవ్, బీబీనగర్లో శ్రీనివాస్, లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్న శేఖర్పై కేసులు నమోదు చేశారు. హానికరమైన ఫార్మాల్డీహైడ్, సుక్రోస్, అమోనియం సల్ఫేట్ లాంటి రసాయనాలను స్వాధీనం చేసుకున్నారు. అధికారులు పంచనామా చేసి పోలీసులకు అప్పగించడంతో వారు అదుపులోకి తీసుకున్నారు.