హైదరాబాద్, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడమే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రధాన ఎజెండా అని, కేంద్రం కుట్రలను సాగనివ్వబోమని బీఆర్ఎస్ పార్టీ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని తేల్చి చెప్పారు. విశాఖ ఉకు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో ఏపీలోని పార్టీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు.
వైసీపీ, టీడీపీ ప్రధాని మోదీ వద్ద మోకరిల్లాయని ఆరోపించారు. వైజాగ్ స్టీల్ప్లాంట్పై ప్రత్యక్షంగా, పరోక్షంగా 5 లక్షల మంది ఆధారపడి జీవిస్తున్నారని చెప్పారు. వైజాగ్ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడమే కాకుండా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్ప్లాంట్పై కనీస అవగాహన లేకుండా ఏపీ కార్మిక శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతున్నారని విమర్శించారు. విశాఖ ఉకు బిడ్డింగ్ ప్రక్రియలో సాధ్యాసాధ్యాలను పరిశీలించిన అనంతరం కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. బైలదిల్లాలోని ఐరన్ఓర్ గనులను వైజాగ్ స్టీలుప్లాంట్, బయ్యారంలకు కేటాయించి, తెలుగు ప్రజల హకులను కాపాడాలని ఆయన కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.