తొర్రూరు, డిసెంబర్ 11: మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన రైతు మంగళపల్లి నీలిమాకృష్ణమూర్తి ఉత్తమ మహిళా రైతు పురస్కారం అందుకున్నారు. ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ అండ్ మీడియా మీడియేషన్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న 11 మంది ఉత్తమ మహిళలకు పురసారాలు ప్రకటించింది. ఇందులో భాగంగా ఆదివారం హైదరాబాద్లోని నోవాటెల్లో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ మహిళా రైతు క్యాటగిరీ కింద ఆమె సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. నీలిమ తొర్రూరు మండల శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎరువులు, రసాయనాలు వాడకుండా ఆకుకూరలు, కూరగాయలు పండిస్తున్నారు. రసాయనాలు వాడటం వల్ల నేల నిస్సారం అవుతున్నదని భావించి సేంద్రియ సాగుకు పూనుకొన్నది.