హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ తెలంగాణ మజ్దూర్ యూనియన్తో అశ్వత్థామరెడ్డికి సంబంధం లేదని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి థామస్రెడ్డి స్పష్టం చేశారు. టీఎంయూ పేరుతో మరోసారి ఆర్టీసీ కార్మికులను మోసం చేయడానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
ఆర్టీసీ కార్మికులు కాంగ్రెస్కు మద్దతు ప్రకటిస్తున్నట్టు ఆయన చేసిన ప్రకటనకు యూనియన్తో సంబంధం లేదని తేల్చి చెప్పారు. సోమవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ను అడ్డుపెట్టుకొని అశ్వత్థామరెడ్డి మరోసారి కార్మికులను మోసం చేయడానికి వీధినాటకాలకు దిగాడని విమర్శించారు. కార్మికులు, నాయకులు వాస్తవాన్ని గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.