Malla Reddy | ఈసారి అసెంబ్లీ సమావేశాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అసెంబ్లీ ఆవరణలో శనివారం సాయంత్రం ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీలో హరీశ్రావు వన్ మెన్ హీరో అని కొనియాడారు.
కాంగ్రెస్ నాయకులకు మేడిగడ్డ తప్ప వేరే గడ్డనే దొరకడం లేదని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. రోజూ మేడిగడ్డ మేడిగడ్డ అంటే ప్రజలు భేజారు అవుతున్నారని విమర్శించారు.