హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కంపెనీల్లో యువత సీఈవోలుగా మిగిలిపోకుండా అలాంటి కంపెనీలు సొంతంగా స్థాపిం చి, పారిశ్రామికవేత్తలుగా ఎదిగి ఉద్యోగాలు ఇచ్చేస్థాయికి చేరుకోవాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు విద్యార్థులకు ఉద్బోధించారు. జేఎన్టీయూ హైదరాబాద్లో యూనివర్సిటీ గోల్డెన్ జూబ్లీ సందర్భంగా గురువారం ‘ఇన్నోవేషన్ ఇన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ’ అంశంపై ఏర్పాటుచేసిన 3 రోజుల అంతర్జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు.
విదేశాల నుం చి దిగుమతి చేసుకుంటున్న బ్రాండెడ్ ఉత్పత్తులను ఇక్కడే తయారు చేసేలా విద్యార్థులంతా ఎదగాలని ఆకాంక్షించారు. రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఎనిమిదేండ్లలోనే ఎన్నో ఐటీ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు తీసుకొచ్చిన ఘనత మంత్రి కేటీఆర్దే అని ప్రశంసించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబా ద్రి, వర్సిటీ వీసీ కట్టా నరసింహారెడ్డి, సైయంట్ వ్యవస్థాపకుడు బీవీఆర్ మోహన్రెడ్డి, రెక్టార్ ప్రొఫెసర్ గోవర్ధన్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్, ఇక్ఫాయ్ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ ఎల్ఎస్ గణేశ్, కాన్ఫరెన్స్ కన్వీనర్ తారాకల్యాణి, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.