లింగంపేట, మే 24: కాంగ్రెస్ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమం రచ్చరచ్చగా మారింది. ఇరువర్గాలు కొట్టుకొని ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకొన్నది. లింగంపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షరీఫ్ ఆధ్వర్యంలో మండలంలోని కోమట్పల్లిలో రచ్చబండ చేపట్టారు. ఈ విషయం తెలుసుకొన్న ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ కో-ఆర్డినేటర్ సుభాష్రెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకొన్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల వారు పరస్పరం దాడులకు దిగారు. ఇరువర్గాల నాయకులు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకొన్నారు.