హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): పశుసంవర్ధక శాఖ ఈ ఏడాది భారీగా రిటైర్మెంట్లు ఉండనున్నాయి. ఈ మేరకు ఉద్యోగ విరమణ చేసే అధికారుల జాబితాను ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదర్ సిన్హా బుధవారం విడుదల చేశారు. ఈ ఏడాది అన్ని కేడర్లలో కలిపి 13 మంది అధికారులు ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇందులో డైరెక్టర్ స్థాయి ఉన్న టీఎస్ఎల్డీఏ సీఈవో మంజువాణి మే 31న ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఈమెతో పాటు మరో ఐదుగురు జాయింట్ డైరెక్టర్ క్యాడర్ అధికారులు, ఏడుగురు డిప్యూటీ డైరెక్టర్ క్యాడర్ స్థాయి అధికారులు రిటైర్మెంట్ కానున్నారు.