సిద్దిపేట : దేశంలోనే తొలిసారిగా రూ.300 కోట్లతో సిద్దిపేట పట్టణంలో భూగర్భ మురుగునీరు శుద్ధీకరణ కేంద్రం ఏర్పాటు చేశాం. ఎస్టీపీ ద్వారా శుద్ధిచేసిన మురుగునీటిని నర్సాపూర్ చెరువులోకి విడుదల చేస్తామని మని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. సిద్దిపేటలో ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి భూగర్భ మురుగునీటి సేకరణ కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకం అన్నారు.
చెత్తను మురుగునీటి పైపులలో వేయకుండా తడి చెత్త, పొడి చెత్తను వేరు వేరుగా సేకరించి చెత్తను సేకరించే వాహనాల్లో వేయాలని సూచించారు. అందరి సహకారంతో సిద్దిపేట విద్య, వైద్య ఆరోగ్యం తదితర అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రస్తుతం సిద్దిపేటలో మహిళా డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్, మెడికల్, పీజీ, నర్సింగ్ కాలేజీలున్నాయి. సిద్దిపేట మున్సిపాలిటీకి జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో 18 అవార్డులు వచ్చాయి వచ్చాయి. ఇదేవిధంగా ఎల్లకాలం అభివృద్ధిలో మొదటి స్థానంలో నిలిచేలా పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఒకప్పుడు తాగునీటి సమస్యతో పిల్లనివ్వడానికి ముందుకు రాని సిద్దిపేటలో ప్రస్తుతం ఇంటింటికి శుద్ధమైన గోదావరి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. మండుటెండలో కూడా కోమటిచేరువు మత్తడి పోస్తుందని మంత్రి పేర్కొన్నారు. ముడున్నర ఏండ్లలోనే అండర్ గౌండ్ డ్రైనేజీ సిస్టమ్ ను ఏర్పాటు చేసిన మొదటి పట్టణం సిద్దిపేట అన్నారు.
సిద్దిపేట పట్టణంలో నూతనంగా నిర్మించిన భూగర్భ మురుగునీటి శుద్ధీకరణ కేంద్రాన్ని మంత్రి హరీశ్రావు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు pic.twitter.com/jE6tT61mEF
— Namasthe Telangana (@ntdailyonline) April 20, 2022