న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశంలో చమురు, నిత్యావసర వస్తువుల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బందులు ప్రజలకు మరోవైపు పన్నుల రూ పంలో వాతలుపెట్టి ఖజానా నింపుకొంటున్న మోదీ సర్కార్.. ప్రజల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ముఖ్యంగా ప్రజారోగ్య రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3 శాతాన్ని మాత్రమే ప్రజారోగ్య సంరక్షణకు వెచ్చిస్తున్నట్టు తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన ఈ గణాంకాల ప్రకారం.. మన దేశంలో ఆరోగ్య బీమా సాంద్రత (ఒక్కో వ్యక్తి ప్రీమియం) కేవలం 5 శాతమే. కానీ, వైద్య సే వల కోసం ప్రజలు తమ జేబుల్లో ఉన్న సొమ్ము కు అదనంగా పొదుపు నిధుల నుంచి చేస్తున్న వ్యయం (ఔట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్) 55 శాతంగా ఉన్నది. ఇది ప్రపంచంలోనే అత్యధికమని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. భారత్లోని ప్రైవేట్ దవాఖానల్లో వైద్య సేవలు పొందేందుకు అవుతున్న వ్యయం విపరీతంగా పెరిగిందని, దీంతో ఎంతో మంది ప్రజలు తమ భవిష్యత్తు అవసరాల కోసం కూడబెట్టుకొన్న పొ దుపు నిధులను కూడా వైద్యానికి ఖర్చుచేసి పేదరికంలోకి జారిపోతున్నారని వివరించిం ది.
ప్రస్తుతం మన దేశంలో చికిత్సల కోసం దవాఖానల్లో చేరుతున్నవారిలో దాదాపు 60% మంది అవసరాలను, ఔట్పేషెంట్ సేవల కోసం దవాఖానలకు వెళ్తున్నవారిలో 70% మంది అవసరాలను ప్రైవేట్ రంగమే తీరుస్తున్నట్టు తెలిపింది. దేశంలో ఇప్పటికే బీమా రక్షణ పొందినవారిలో కూడా చాలా మంది తమ ఆరోగ్య సమస్యలను తక్కువగా అంచనా వేశారని, అవసరమైనంత స్థాయిలో ఆరోగ్య బీమా పాలసీలను కొనుగోలు చేయలేదని ప్రపంచ బ్యాంక్ పేర్కొన్నది.