హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): మేడిగడ్డ బరాజ్ కుంగిన ఘటనపై విజిలెన్స్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ నివేదికలో మేడిగడ్డ కుంగిపోవడానికి ఐదు కారణాలను వివరించింది. మొదటి నుంచీ ప్రాజెక్టు నిర్వహణను గాలికొదిలేశారని పేర్కొన్నది. బరాజ్ నిర్మా ణం పూర్తయిన తర్వాత ఇరిగేషన్ అథారిటీ తనిఖీ చేయలేదని తెలిపింది.
ప్రాజెక్టు నిర్మా ణం పూర్తయినా షీట్స్, ఆర్ఆర్ పిచ్చింగ్లను ఏజెన్సీ తొలగించలేదని తెలిపింది. దీంతో వరద వచ్చినప్పుడు బరాజ్కు నష్టం కలిగినట్టు వెల్లడించింది. 2020 మే18నే డ్యామేజ్ అయ్యిందని తెలిపింది. ఇలా ఐదుసార్లు వరద వచ్చినా మెటీరియల్ తీసివేయలేదని పేర్కొన్నది. తొలిగించాలని అధికారులు 4 సా ర్లు చెప్పినా ఏజెన్సీ పట్టించుకోలేదని చెప్పిం ది. వరద వచ్చిన తర్వాత చేపట్టాల్సిన పనులను కూడా చేయలేదని పేర్కొన్నది.