నల్లగొండ : ఎన్నికల్లో చెప్పిన మ్యానిఫెస్టో మొత్తాన్ని అమలు చేసి.. ఇవ్వని హామీలను కూడా అమలు చేసి ప్రజల మనసును గెలుచుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. చండూరులో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం, వన భోజనాల కార్యక్రమానికి మంత్రి హాజరై మాట్లాడారు
కల్యాణ లక్ష్మి పథకం సమాజంలో గొప్ప మార్పును తీసుకొచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ పథకాలు ప్రజల కష్టాలను దూరం చేసాయన్నారు. సీఎం కేసీఆర్ మానవత్వంతో పాలన చేస్తున్నారని ప్రశంసించారు.
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే గొప్ప నాయకుడు కేసీఆర్ అన్నారు. ఆకలి అన్నదే లేని ఏకైక రాష్ట్రo తెలంగాణ. గతంలో తాగు నీళ్లకు కూడా తండ్లాట పడ్డాం. ఇప్పుడు మిషన్ భగీరథతో తాగు నీటి గోస తీరిందని మంత్రి తెలిపారు.
తెలంగాణ దేశానికే అన్నపూర్ణగా మారింది. ఫ్లోరైడ్ భూతం అంతం చేశామని కేంద్రమే ఒప్పుకుందన్నారు ఇది కేసీఆర్ దర్శనికతతోనే సాధ్యం అయిందన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను దేశ ప్రజలంతా అడుగుతున్నారు. అందుకే బీజేపీ వాళ్లు తెలంగాణ పైన దాడికి దిగారన్నారు. బీజేపీని ఎక్కడికక్కడ నిలదీయాలి.
టీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల వలే పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, నోముల భగత్, మాజీ ఎమ్మెల్యే కుసుకుట్ల ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.