హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 14 (నమస్తే తెలంగాణ): కాజీపేట-బలార్ష్ష సెక్షన్లో మూడో రైల్వే లేన్ అందుబాటులోకి వచ్చింది. హసన్పర్తిరోడ్డు-ఉప్పల్ మధ్య 12.7 కిలోమీటర్ల విద్యుదీకరణ పనులు పూర్తవడంతో 131.7 కి.మీ. పొడవైన మూడో లైన్ ప్రారంభమైనట్టు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ వెల్లడించారు. దీంతో గ్రాండ్ ట్రంక్ రూట్లో సరుకు రవాణా, ప్యాసింజర్ రైళ్ల రద్దీ మరింత తగ్గుతుందని తెలిపారు. విద్యుదీకరణ పనులను పూర్తిచేసిన సికింద్రాబాద్ డివిజన్ సిబ్బందిని అభినందించారు.