భద్రాచలం, డిసెంబర్ 25: భద్రాద్రి దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మూడోరోజు ఆదివారం భద్రాద్రి రామయ్య వరాహావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. వరాహావతారంలో ఉన్న రామయ్యను భక్తులు దర్శించుకొన్నారు. కాగా, భద్రాద్రి దేవస్థానంలో 4వ రోజు శ్రీసీతారామచంద్రస్వామివారు నృసింహావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు.