హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ): ప్రముఖ కవి గుంటూరు శేషేంద్రశర్మ గ్రంథ హకుల వివాదంపై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. శేషేంద్రశర్మ రచించిన గ్రంథాలపై హకులు ఆయన కుమారుడు సాత్యకికే చెందుతాయని స్పష్టంచేసింది. ఈ మేరకు గతంలో సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు ఆమోదించింది. శేషేంద్రశర్మ రెండో భార్య దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది.
తన పుస్తకాలు, గ్రంథాలపై హకులు కుమారుడు సాత్యకికే చెందుతాయంటూ శేషేంద్రశర్మ 1989లో హకుల పత్రం రాశారు. 2007లో ఆయన కన్నుమూశారు. శేషేంద్రశర్మ తనను వివాహం చేసుకున్నారని, తనకు కూడా ఆ పుస్తకాలపై హకులు ఉంటాయని హైదరాబాద్కు చెందిన ఇందిరా ధనరాజ్గిర్ గతంలో సిటీ సివిల్ కోర్టులో చేసిన న్యాయపోరాటం వీగిపోయింది. సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఇందిర హైకోర్టులో దాఖలు చేసిన ఆప్పీల్ పిటిషన్ను కొట్టి వేస్తూ న్యాయమూర్తి జస్టిస్ జీ రాధాదేవి తీర్పు వెలువరించారు.