నర్సాపూర్, జూలై 15: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరుతో రాష్ట్రంలోని రైస్మిల్లర్లు దివాళా తీసే పరిస్థితి నెలకొన్నదని ప్రముఖ వ్యాపారవేత్త, రైస్మిల్ యజమాని పైడి శ్రీధర్గుప్తా ఆవేదన వ్యక్తంచేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేసి రైస్మిల్లులకు తరలించిందని, కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలోని ధాన్యాన్ని తీసుకోకపోవడంతో రైస్మిల్లుల్లో వడ్లు, బియ్యం సంచులు పేరుకుపోయాయని వెల్లడించారు. ఇటీవల కురిసిన వర్షానికి ధాన్యం, బియ్యం సంచులు మొలకెత్తాయని, తనకు రూ.కోటి నష్టం వాటిల్లిందని వాపోయారు.