హైదరాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ (టీఎస్ఎంసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల చేసి, నవంబర్ 30న పోలింగ్ నిర్వహించనున్నట్టు టీఎస్ఎంసీ వెల్లడించింది. ఈ మేరకు సోమవారం షెడ్యూల విడుదల చేసింది. మెడికల్ కౌన్సిల్లో 25 మంది వైద్యులు సభ్యులుగా ఉంటా రు.
ఇందులో 12 మందిని ప్రభు త్వం నామినేట్ చేస్తుంది. మిగతా 13 మం దిని టీఎస్ఎంసీలో రిజిస్టర్ అయిన డాక్టర్లు తమ ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటారు. అనంతరం ఈ 25 మంది సభ్యులు కలిసి సీక్రెట్ ఓటింగ్ ద్వారా ఒకరిని కౌన్సిల్ చైర్మన్గా ఎన్నుకుంటా రు. టీఎస్ఎంసీ జాబి తా ప్రకారం రాష్ట్రంలో 48,405 మం ది వైద్యులు రిజిస్టర్ అయ్యారు. బ్యాలెట్ పద్ధతిలో వీరంతా తమ ఓటుహక్కును వినియోగించుకుంటారు. డిసెంబరు 1న ఓట్లు లెక్కించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు.