ఖైరతాబాద్, జనవరి 19: ఓటు హక్కు, దాని విశిష్టత, ప్రజల బాధ్యతను గుర్తుచేస్తూ ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ రాసిన ‘నా ఓటు.. నా ఆయుధం’ పాట సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విడుదలైంది. ఈ పాటను రాష్ట్ర మాజీ సీఎస్ ఎస్కే జోషి, రెడ్ క్రాస్ చైర్మన్ అజయ్మిశ్రా, తెలంగాణ డెవలపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జీవీ రావు, మాజీ ఐఏఎస్ అధికారులు విద్యాసాగర్, భాస్కర్, సంగీత దర్శకుడు యశోకృష్ణ, గాయకుడు రామ్కీ ఆవిష్కరించారు.
అతిథులు మాట్లాడుతూ.. నేడు 70 శాతం మంది ప్రజలు ఓటు హక్కును గుర్తించడం శుభపరిణామని అన్నారు. పాఠశాల స్థాయి నుంచే ఓటు హక్కు విలువ, బాధ్యతపై అవగాహన కల్పించాలని కోరారు. ఓటు హక్కు మీద పాటను తీసుకొచ్చిన స్ఫూర్తితో డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై కూడా పాటను రచించాల్సిన అవసరం ఉన్నదని సుద్దాల అశోక్తేజ తెలిపారు. ఈ పాటను అంగ్లంలో జీవీ రావు రచించారని పేర్కొన్నారు.