యాదాద్రి ;యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారి దివ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వరుస సెలవులు రావడంతో స్వామివారిని దర్శించుకొనేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో దేవాలయ ప్రాంగణం, మాడ వీధులు, ప్రసాద విక్రయశాల, పుష్కరిణి ప్రాంతాలు భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్లు, క్యూ కాంప్లెక్స్ కిక్కిరిశాయి. ధర్మ దర్శనానికి 4 గంటలు, వీఐపీ దర్శనానికి 3 గంటల సమయం పట్టిందని భక్తులు తెలిపారు. 44 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా, ఖజానాకు రూ.64,50,178 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు.