BR Ambedkar | హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ట్యాంక్బండ్ వద్దనున్న 125 అడుగుల మహా అంబేద్కర్ విగ్రహం ముందు ఫొటో పెట్టి నివాళులు అర్పించినట్టు ఎస్సీ అభివృద్ధిశాఖ సోమవారం వివరణ ఇచ్చింది. అంబేద్కర్ జయంతి రోజున మహా అంబేద్కర్కు ప్రభుత్వం అలంకరణ చేయకపోవడంపై ‘అలంకరణకు నోచుకోని అంబేద్కర్’ పేరుతో నమస్తే తెలంగాణ దినపత్రికలో కథనం ప్రచురితమైంది.
ఎస్సీ అభివృద్ధిశాఖ ఈ కథనంపై వివరణ ఇస్తూ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రజలు సందర్శించుకునేలా గేట్లు తెరిచే ఉంచామని పేర్కొంది. విగ్రహం ముందు అంబేద్కర్ ఫొటో పెట్టి పూలమాలలు వేసి నివాళులు అర్పించినట్టు వివరించింది.