హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం కీలకపాత్ర పోషించిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. శనివారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాసంలో ‘తెలంగాణ ఉద్యోగుల సంఘం-2023’ డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులతో ఆయన మాట్లాడారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఉవ్వెత్తున సాగిన ఉద్యమానికి అడుగడుగునా ఉద్యోగులు సహకరించారని పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం ఎప్పటికప్పుడూ పరిష్కరిస్తుందని వెల్లడించారు. ఇటీవల తెలంగాణ ఉద్యోగుల సంఘం చైర్మన్ పద్మాచారి ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లినప్పుడు సానుకూలంగా స్పందించారని గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు రవీంద్రకుమార్, ప్రధాన కార్యదర్శి హరీశ్కుమార్రెడ్డి, నగర అధ్యక్షుడు నర్సింగరావు, పవన్కుమార్ గౌడ్. జి.పద్మ. జి.మహేశ్వర్గౌడ్, మహేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.