హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఈ నెల 15న నిర్వహించిన టీఎస్ టెట్ ఫలితాలు బుధవారం విడుదలకానున్నాయి. ఎప్పుడూ కఠినంగా ఉండే పేపర్1 ఈసారి సులభంగా రావడంతో ఇందులో ఉత్తీర్ణత పెరిగే అవకాశం ఉన్నది. పేపర్2 కాస్త కఠినంగా రావడంతో ఇది ఉత్తీర్ణతపై ప్రభావం చూపవచ్చు.