హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): దేశంలోని కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయుల ఎంపికకు నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
పీజీటీ, టీజీటీ పోస్టుల పరీక్ష ఫలితాలను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ శుక్రవారం విడుదల చేసింది. 13,404 పోస్టుల్లో 1,409 పీజీటీ, 3,176 టీజీటీ ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలతోపాటు ఇంటర్వ్యూ తేదీలు వెబ్సైట్లో ఉన్నాయని పేర్కొన్నది.