హైదరాబాద్ : వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణే ధ్యేయమని బోర్డ్ చైర్మన్ మహ్మద్ సలీం పేర్కొన్నారు. నాంపల్లి మసీద్ సమీపంలో ఆక్రమణకు గురైన స్థలాన్ని వక్ఫ్ బోర్డుకు అప్పగించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు శనివారం రెవెన్యూ, పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి ఆక్రమణలను తొలగింపజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ సలీం మాట్లాడుతూ ఆక్రమణకు గురైన మిగతా వక్ఫ్ బోర్డు స్థలాలపై కూడా శక్తివంచన లేకుండా న్యాయస్థానాల్లో పోరాడుతున్నామని వెల్లడించారు. ఆయన వెంట డీఎస్పీ ఖాజా మొయినొద్దీన్, ఓఎస్డీ మహ్మద్ ఇలియాస్, అసదుల్లా, అబ్దుల్ ఖదీర్, ఇబ్రహీం, జహేద్ తదితరులు ఉన్నారు.