హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని అహ్మదాబాద్లో 36వ జాతీయ క్రీడల ప్రారంభం సందర్భంగా క్రీడాకారులతో ప్రధాని మోదీ వ్యవహరించిన తీరును రాష్ట్ర రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (రెడ్కో) చైర్మన్ వై సతీశ్ రెడ్డి ఖండించారు. క్రీడాజ్యోతి వెలిగించే సందర్భంలో క్రీడాకారులు వేదికపై నుంచి వెళ్లిపోవాలని చెప్పడం బాధాకరమన్నారు.
ప్రపంచవేదికలపై దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్తున్న క్రీడాకారులకు ప్రధాని చేదు అనుభవాన్ని మిగిల్చారని నిరసన వ్యక్తం చేశారు. జాతీయక్రీడల వేదికపై జరిగిన ఘటన దేశంలోని క్రీడాకారులందరినీ అవమానించడమేనని పేర్కొన్నారు. క్రీడాకారులకు ప్రధాని మోదీ వెంటనే క్షమాపణలు చెప్పాలని సతీశ్రెడ్డి డిమాండ్ చేశారు.