HomeTelanganaThe People Of Gajwel Constituency Were Asked Not To Trust The Spears And Cast Their Votes
ఈటల రాజేందర్ ఓటమే లక్ష్యం : ఈటల దళిత బాధితుల సంఘం అధ్యక్షుడు సంపత్
17 దళిత కుటుంబాలపై అక్రమంగా కేసులు పెట్టించి జైలుకు పం పించిన ఈటల రాజేందర్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఆయన అరాచకాలను గడపగడపకూ ప్రచారం చేయాలని, ఈటల దళితవాడలకు వస్తే తరిమికొట్టాలని, ఆయన చెప్పే మాటలను ప్రజలు నమ్మొద్దని ఈటల రాజేందర్ దళిత బాధితుల సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు తి ప్పారపు సంపత్ పిలుపునిచ్చారు.
గజ్వేల్, అక్టోబర్ 28: 17 దళిత కుటుంబాలపై అక్రమంగా కేసులు పెట్టించి జైలుకు పంపించిన ఈటల రాజేందర్ను ఓడించడమే లక్ష్యంగా పనిచేయాలని, ఆయన అరాచకాలను గడపగడపకూ ప్రచారం చేయాలని, ఈటల దళితవాడలకు వస్తే తరిమికొట్టాలని, ఆయన చెప్పే మాటలను ప్రజలు నమ్మొద్దని ఈటల రాజేందర్ దళిత బాధితుల సంఘం హుజూరాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు తి ప్పారపు సంపత్ పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్క్లబ్లో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ నేత ఈటల రాజేందర్ పైకి కనిపించేంత మంచి మనిషి కాదని, లోపల మరో దుర్మార్గుడు దాగి ఉన్నాడని ఆరోపించారు.
గజ్వేల్ నియోజకవర్గ ప్రజలు ఈటలను నమ్మి ఓట్లు వేయొద్దని కోరారు. ఈటల అక్రమ ఆస్తులపై సీబీఐ విచారణ జరిపించాలని కోరితే తమపై కేసులు పెట్టించి 62 రోజులపాటు జైలుకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈటల బాధితులతో కలిసి త్వరలోనే బస్సుయాత్ర చేపట్టి.. గజ్వేల్, హుజూరాబాద్ ప్రాంతాల్లో ఆయన అరాచకాలు, హత్యా రాజకీయాలపై ప్రజలకు తెలియజేస్తామని చెప్పారు. ఈటలను రాజకీయంగా బొందపెట్టడమే తమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మో సం చేసి మతతత్వ పార్టీలో చేరిన ఆయనకు బుద్ధి చెప్పాలని సూచించారు. సమావేశంలో ఈటల బాధితులు జానీ, కదిరె రమేశ్, దాట్ల ప్రవీణ్, రాజేశ్వర్రావు, శైలజ, దేవి తదితరులు పాల్గొన్నారు.‘