Vultures | హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగా ణ): గతంలో ఊరు చివర గుంపులు గుంపులుగా ఎగిరే రాబందులు ఇప్పుడు కనిపించడంలేదు. ప్రపంచంలో అంతరించిపోతున్న జీవజాతుల జాబితాలో వీటిని కూడా చేర్చారు. ఈ అరుదైన రాబందుల ఉనికి మన రాష్ట్రంలో ఉండటమే కాకుండా..వాటి సంతతి కూడా పెరుగుతున్నదని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పాలరాపుగుట్ట వీటికి కేంద్రంగా మారింది. దీంతో ఈ ప్రాంతాన్ని ‘జటాయువు’ పేరుతో సంరక్షణ కేంద్రంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. కాగజ్నగర్ ఫారెస్ట్ డివిజన్ పరిధిలోని పెంచికల్పేట్ మండలం నందిగామ సమీపంలో పాలరాపుగుట్ట ఉంది. ఈ గుట్టపై నాలుగేండ్ల క్రితం రాబందుల ఉనికిని గుర్తించారు. వాటి సంరక్షణకు నిధులను, సిబ్బందిని కేటాయించారు. గుట్టపై ఐదు ఎకరాల్లో ఫెన్సింగ్ వేసి, బేస్ క్యాంప్ ఏర్పాటు చేశారు. రాబందుల కదలికలను ఎప్పటికప్పుడు కెమెరాలో రికార్డు చేస్తున్నారు.
నివాసానికి అనువుగా గుట్ట
పాలరాపుగుట్టకు చిన్నచిన్న రంధ్రాలు ఉం డటంతో ‘లాంగ్ బిల్డ్ వల్చర్’ జాతి రాబందు లు ఇక్కడ ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నా యి. నాలుగేండ్ల క్రితం పది రాబందులు ఉం డగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 33కు చేరినట్టు సర్వేలో తేలింది. ఈ గుట్టపై వందకుపైగా రాబందులు నివసించేలా సౌకర్యాలు ఉన్నాయని ఫారెస్ట్ అధికారులు పేర్కొన్నారు. బయాలజిస్ట్ రవికాంత్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ రేంజ్ అధికారులు వీటి పర్యవేక్షణ చేపట్టారు. పశువులకు ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు వాడే డైక్లోఫెనాక్ ఇంజెక్షన్లు రాబందులకు హానికరంగా మారినట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. పశువులు కళేబరాలను తినడం వల్ల ఈ ఔషదం రాబందుల విసర్జక వ్యవస్థను దెబ్బతీయడంతో అవి చనిపోతున్నట్టు తేల్చారు. దీంతో డైక్లోఫెనాక్ మందులను పశువులకు ఉపయోగించకుండా నిషేధించారు.