హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కొవిడ్ కేసుల్లో మరోసారి స్వల్ప పెరుగుదల నమోదైంది. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 52 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్లో 30 కేసులు వెలుగు చూశాయి. మొత్తం 5,254 మందికి పరీక్షలు నిర్వహించారు. ఎలాంటి ఆందోళన అవసరం లేదని, పాజిటివిటీ రేటు ఒక్క శాతం లోపే ఉన్నదని అధికారులు తెలిపారు. కొవిడ్తోపాటు ఇన్ఫ్లూయెంజా ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం, తరుచూ చేతులు కడుక్కోవడం వంటి కొవిడ్ జాగ్రత్తలు పాటించాలని సూచించారు.