పాపన్నపేట/మెదక్ : జిల్లాలోని పాపన్నపేటలో గల పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గభవానీ మాత ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవుదినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో ఏడుపాయలకు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పలు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మంజీర నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి దుర్గామాతకు మొక్కులు చెల్లించుకున్నారు.
కొందరు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించగా మరికొందరు తలనీలాలు, బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఏడుపాయలకు వచ్చిన భక్తులు కరోనా నిబంధనలు పాటించాలే ఆలయ సిబ్బంది చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి..
బహుజన తత్వవేత్త జ్యోతిరావు పూలే : మంత్రి పువ్వాడ
‘మల్లన్న’ క్షేత్రంలో భక్తుల కోలాహాలం
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పూలే : మంత్రి ఐకే రెడ్డి
గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి రావు ఫూలే