Yellandu | భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 5 (నమస్తే తె లంగాణ)/ఇల్లెందు: ఇల్లెందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావుపై సోమవారం ప్ర వేశపెట్టిన అవిశ్వాస తీర్మానం కిడ్నాప్ హైడ్రామా, ఉద్రిక్తతల నడుమ వీగిపోయింది. మున్సిపల్ చైర్మన్పై 19 మంది కౌన్సిలర్లు అసమ్మతి ప్రకటించా రు. గతనెల 19న కలెక్టర్ ప్రియాంక ఆలను కలిసి మున్సిపల్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఇల్లెందు మున్సిపల్ కార్యాలయంలో ప్రిసైడింగ్ ఆఫీసర్, కొత్తగూడెం ఆర్డీవో శిరీష అవిశ్వాస తీర్మానం కోసం సమావేశం నిర్వహించారు. కోరం పూర్తి కావాలంటే సమావేశానికి మొత్తం సభ్యులు 24 మంది, ఎక్స్అఫీషియో సభ్యుడైన ఎమ్మెల్యేతో కలిపి కనీసం 17 మంది హాజరు కావాల్సి ఉండ గా, కేవలం 15 మంది హాజరయ్యారు. అయినప్పటికీ 12 గంటలకు 15 మంది సభ్యులే హాజరయ్యారు. దీంతో ప్రిసైడింగ్ ఆఫీసర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు ప్రకటించారు.
అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో కొన్ని గంటలపాటు మున్సిపల్ కార్యాలయం వద్ద హైడ్రామా నెలకొన్నది. ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కొక్కు నాగేశ్వరరావు అనే కౌన్సిలర్ను అపహరించారని, బీఆర్ఎస్ నుంచి గెలిచిన మరో ఐదుగురు కౌన్సిలర్లను ప్రత్యేక క్యాంప్కు తరలించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే హరిప్రియానాయక్, బీఆర్ఎస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వ కార్యాలయాల అద్దాలు పగులగొట్టినా, తమను దూషించినా, ఎమ్మెల్యే కనకయ్య, పోలీసులు నోరు మెదపలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొక్కు నాగేశ్వరరావు భార్య వెంకటలక్ష్మితో కలిసి ఇల్లెందు పోలీస్స్టేషన్లో ఎమ్మెల్యే కనకయ్య అనుచరులపై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే కనకయ్యపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్టు సీఐ కరుణాకర్ తెలిపారు. కాగా, కిడ్నాప్కు గురైన కౌన్సిలర్ నాగేశ్వరరావును కొన్ని గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే కనకయ్య అనుచరులు తిరిగి ఇల్లెందు పోలీస్స్టేషన్ ఎదుట వదిలిపెట్టినట్టు సమాచారం.